నూతనంగా ఎన్నికైన ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం నేడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కలిసిన ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యులను సాజిద్ ఖాన్ శాలువా కప్పి సన్మానించారు.
ఆయనను కలిసిన వారిలో ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సతీష్ మిట్టల్, ప్రధాన కార్యదర్శి ఝరి నర్సయ్య, సభ్యులు ప్రమోద్ కుమార్ ఖత్రి, కందుల రవీందర్, పడకంటి సూర్యకుమార్ లు ఉన్నారు.
ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి లో నెలకొన్న పలు సమస్యల పై సాజిద్ ఖాన్ ప్రస్తావించారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో వెంటిలేటర్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం ఏ షకీల్, రాజు యాదవ్, రాహుల్ చంద్రాల తదితరులు పాల్గొన్నారు.