26.7 C
Hyderabad
May 12, 2024 09: 06 AM
Slider వరంగల్

క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి చేయూతనందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

మనుషులకు అనారోగ్య సమస్యలు సహజమని, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి వ్యాధినైనా మనోధైర్యంతో జయించాలని  ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కొండపర్తి సదాశివచారి వృత్తిరీత్యా టైలరింగ్ చేస్తూ జీవనం సాగించేవారు. క్యాన్సర్ వ్యాధితో ఆరోగ్యం క్షీణించి అవస్థలతో మంచానికి పరిమితం అయ్యాడు. టైలరింగ్ యూనియన్ వారు అతడి పరిస్థితిని గురించి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా దృష్టికి తీసుకెళ్లారు.

మంగళవారం వారితో పాటు తస్లీమా అతడి వద్దకు వెళ్ళగా ఆరోగ్యం మొత్తం క్షిణించిపోయింది. అతడి పరిస్థితిని చూసి తస్లీమా  చలించిపోయారు. తస్లీమా అతడిని పట్టుకొని ధైర్యం చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎలాంటి వ్యాధులైన నయం అవుతాయని,ధైర్యంగా ఉండాలని తస్లీమా అన్నారు. టైలరింగ్ యూనియన్ వారు సేకరించిన డబ్బుతో పాటు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో తస్లీమా కొంత సాయం అందించారు. సదాశివచారి పరిస్థితి సీరియస్ గా ఉందని దాతలు ముందుకు వచ్చి అతడి కుటుంబానికి అండగా నిలవాలని తస్లీమా కోరారు. టైలరింగ్ యూనియన్ సభ్యులు రమేష్, కుమారస్వామి,సుదర్శన్ తదితరులు ఉన్నారు.

Related posts

ఇది చాలా కాన్ఫిడెన్షియల్, నీకు మాత్రమే చెబుతున్నా

Satyam NEWS

షేక్ పేట గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం

Bhavani

ఆజాద్ నగర్ లో సీనీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment