అంబర్ పేట డివిజన్ అజాద్ నగర్ లో సుమారుగా 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబర్ పేట నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో నూతన సీసీ రోడ్డు లైన్లు వేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కార్పొరేటర్ గా నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సహకారంతో అంబర్ పేట డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.
సోమవారం అజాద్ నగర్లో నూతన సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు డిజీఎం విష్ణు, ఈఈ శంకర్, డి.ఈ సువర్ణ, ఎఈ కుషాల్, ఎలక్ట్రిసిటి ఎఈ నాగరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, స్థానిక బస్తీ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట