సీఎం జగన్.. ఈ నెల 3 భోగాపురం ఏర్ పోర్ట్ కు శంకుస్థాపన చేయనున్న సంగతి విదితమే.ఈ క్రమంలో పోలీస్ బందోబస్తు నిమిత్తం… విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ… భోగాపురం..సీఎం జగన్ ఉండే ప్రదేశాలను… శాఖా పరంగా నిర్వహించనున్న బందోబస్తు ను పరిశీలించారు.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేసేందుకు విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ, జిల్లా ఎస్పీ ఎం.దీపిక, పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు హెలిప్యాడ్, వాహన శ్రేణి, సిఎంఆర్ ఎక్స్పో, సభా స్థలం, శంఖు స్థాపన చేపట్టే స్థలాలు, శిలా ఫలకాలు వద్ద భద్రత ఏర్పాట్లును సమీక్షించి, రిహార్సల్స్ నిర్వహించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు..
విశాఖ డీఐజీ, జిల్లా ఎస్పీ వెంట పలువురు డీఎస్పీలు, సిఐలు, ఆరైలు, ఎస్ఐలు, ఆర్ఎసైలు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.