టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు. గోపీనాథన్ రాజీనామా తర్వాత కంపెనీ కె. కృతివాసన్ ఇన్ఛార్జ్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ మేరకు టాటా గ్రూపునకు చెందిన కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. కృతివాసన్ ప్రస్తుతం కంపెనీకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ హెడ్గా ఉన్నారు. ఆయన కంపెనీలో 34 సంవత్సరాల కంటే ఎక్కువ పని అనుభవం కలిగి ఉన్నారు. కాగా గోపీనాథన్ కంపెనీలో 22 ఏళ్ల కెరీర్ తర్వాత రాజీనామా చేశారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా, సీఈవోగా ఆరేళ్లు పనిచేశారు. సెప్టెంబర్ వరకు ఆయన కంపెనీలోనే ఉంటారు. మార్చి 16 నుంచి కృతివాసన్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయి సీఈవోగా నియమితులు కానున్నారు.
previous post