కడప జిల్లా సిద్ధవటం మండలం కడపయపల్లే లింగంపల్లి లో టిడిపి కార్యకర్తల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. టక్కోలి గ్రామానికి చెందిన మాజీ ఎం పి టి సి నాగమణి రెడ్డి కరోనా వైరస్ వల్ల ఆకలితో ఉన్న వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు 250 కుటుంబాలకు గాను నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు,ప్రజలు,యువత పాల్గొన్నారు.
previous post