వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత పాటిస్తే కరోనా లాంటి వైరస్ లు మనల్ని ఏమీ చేయలేవని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. నగర్లో ప్రజలకు కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఆయన నేడు జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని వెంగళ్ రావు డివిజన్ మధుర నగర్ లో ప్రజలను చైతన్య పరిచారు.
అక్కడ కరోనా నివారణ పనులను పరిశీలించి స్వయంగా మందును స్ప్రే చేశారు. ఏప్రిల్ 14 వరకు ఇలాగే లాక్ డౌన్ లో పాల్గొనాలని ఆయన ప్రజల్ని కోరారు. నిత్యవసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రాహారాలు మాని కరోనా వ్యాప్తి జరుగుతున్న తీరుపై సమీక్షలు జరుపుతున్నారని మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈ కఠిన సమయంలో కారుణ్యంతో వ్యవహరించే ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమని ఆయన తెలిపారు.