35.2 C
Hyderabad
April 27, 2024 12: 41 PM
Slider ప్రత్యేకం

మాచర్లలో మరోసారి హై అలర్ట్.. ముస్లింల మధ్య వైసీపీ చిచ్చు..!

#macharla

మాచర్లలో ముస్లింల మధ్య ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం చిచ్చు రాజేసింది. దీంతో ఇరువర్గాలు వారు రోడ్డున పడి రక్త కారేలా కొట్టుకున్నారు. మాచర్లలో ఎన్నో మారణహోమాలకు ఆద్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల నియోజకవర్గం ప్రజలను మనశ్శాంతిగా నిద్రపోనివ్వరు. వారి చెప్పిందే వేదం.., వారు చేసేది దందా అన్న చందంగా దౌర్జన్యకాండను లీగలైజ్ చేశారు. ప్రశ్నిస్తున్న ప్రజలపై.., తెలుగుదేశం కార్యకర్తలపై నిత్యం దాడులు చేసి మరీ కేసులు పెట్టించడం ఇక్కడ నడుస్తున్న రౌడీ రాజకీయం.

తాజాగా మాచర్ల పట్టణంలో 28వ వార్డులో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే.. వైసీపీ మూకలను రెచ్చగొట్టి.., హత్యాయత్నానికి పురికొల్పాడు పిన్నెల్లి. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న భవిష్యుత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ప్రజలు నుంచి విశేష స్పందన వస్తున్న తీరును జీర్ణించుకోలేక పిన్నెల్లి రావణ గణం హత్యారాజకీయాలకు తెగపడిందన్నది పట్టణ ప్రజలకు తెలియనిది కాదు. మరోవైపు పట్టణంలో తూర్పు బావి సెంటర్ లో ఏర్పాటు చేసిన టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దౌర్జన్యంగా తొలగించారు.

పథకం ప్రకారం టీడీపీ నేతలను టార్గెట్ చేసి కర్రలు, రాళ్ళతో దాడికి దిగి హత్యాయత్నానికి ఒడిగట్టారు. వైసీపీ కౌన్సిలర్ భర్త మస్తాన్, కో ఆప్షన్ మెంబర్ అంగార్ భాష  నాగుల, హుస్సేన్, కణితి మస్తాన్, కణితి రఫీ, జాన్ అహ్మద్, యూసఫ్, కొట్టు జాని తదితరులు కర్రల తో టీడిపి నాయకులు మోసిన్, ముజఫర్,గొర్రె నాసిర్, జాని లపై దాడి చేశారు. ఈ దాడులో టీడీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు వైసీపీ నేతలు ఏ కర్రలతో దాడి చేశారో ఆ కర్రలే తగిలి వైసీపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 

పిన్నెల్లి పిశాచి గణం పథకం ప్రకారం కర్రలు తీసుకొచ్చుకుని మరి టీడీపీ నేతలపై దాడి చేశారన్నది రికార్డైన వీడియో పుటేజ్ చెప్తున్న పచ్చి నిజం. కర్రలతో వైసీపీ నేతలు దాడి చేస్తుంటే.., వారిని అడ్డుకుని వారించే ప్రయత్నంలో టీడీపీ నేతలకు తీవ్ర గాయలయ్యాయి. పార్టీలు, రాజకీయాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసిమెలసి సమస్యలను పరిష్కరించుకునే ముస్లీం సోదర్లు.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వర్గాలుగా విడిపోయి బజారున పడి దాడులకు తెగపడటం ఇదే మొదటి సారి అని ముస్లీం పెద్దలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్లీం సామాజికవర్గంలో పిన్నెల్లి సోదర్లు ఆరని చిచ్చు రగిల్చారని.., ఈ ఆధిపత్య చిచ్చు ఎంతమందిని దహిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దీన్నే సాకుగా తీసుకుని పిన్నెల్లి సోదర్లు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించి.., హింసింస మొదలు పెట్టారు. టీడీపీ ప్రచార కార్యక్రమాలను కుట్రపూర్వకంగా ఆపేందుకు పథకం ప్రకారం దాడి చేయడమేకాక.., వారికి అనుకూలంగా సానుభూతిని గెయిన్ చేసుకునేందుకు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికల వేళ..అది రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం మాచర్లలో అలజడులు సృష్టించేందుకు పిన్నెల్లి కావాలనే నీచ రాజకీయాలకు తెరతీస్తున్నారని స్ధానిక ప్రజలు భావిస్తున్నారు. పిన్నెల్లి బ్రదర్స్ కనుసన్నల్లో ఇప్పటికే పోలీసులు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

`సీటీమార్` సెట్ లో త‌మ‌న్నాబ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

Sub Editor

లాక్ డౌన్ లో పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యత

Satyam NEWS

అడిగే వాడే లేడు: శ్రీకాకుళం జిల్లాలో పురాతన దేవాలయాల కూల్చివేత….

Satyam NEWS

Leave a Comment