వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత చూసి మతి చలించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన అమరావతిపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అమరావతిలో రాజధాని కడతామంటే రైతులు భూములిచ్చారు..అమరావతికి అధికార, ప్రతిపక్షలుండే నిండు సభలో ఒప్పుకుంటేనే రైతులు భూములివ్వడానికి అంగీకరించారు.. అమరావతిలో రాజధాని కడతామని చెప్పి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లలో గెలిచింది అని ఆయన తెలిపారు.
ధర్మాన రాజీనామా కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి..అని ఆయన సవాల్ చేశారు. విశాఖలో సగానికి పైగా పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయి.. దమ్ముంటే 30 మందికి పైగా ఉన్న లోక్ సభ, రాజ్యసభ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖలో రైల్వే జోన్ తీసుకురండి..అని ఆయన అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర పై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజధాని కుప్పంలోనో, నారావారిపల్లిలోనో పెట్టుకుంటే ఏడవండి.. రాష్ట్ర నడిబొడ్డులో నిర్మిస్తున్న రాజధానిపై మీకున్న కష్టమేంటో చెప్పాలి..అని ఆయన అన్నారు.