30.7 C
Hyderabad
May 13, 2024 02: 10 AM
Slider ఆంధ్రప్రదేశ్

రాజధానిలో తెలుగుదేశం నేతల అరెస్టు

amaravathi bundh

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు గుంటూరు జిల్లాల్లో పలువురు టిడిపి నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధం అయ్యింది.

పోలీసులు చిన కాకాని ,కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూల్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మంగళగిరిలో టిడిపి నేత గంజి చిరంజీవి, తాడేపల్లి రూరల్‌ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నాని, పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావును గృహనిర్బంధంలో ఉంచారు. తాడేపల్లి పట్టణ, రూరల్‌ తెలుగుదేశం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

సంగారెడ్డి ల్యాండ్ పార్సెల్స్ ప్రి బిడ్ మీటింగ్ సక్సెస్

Satyam NEWS

కార్యకర్తలను పరామర్శించిన భట్టి విక్రమార్క

Bhavani

వరదల కారణంగా ఆర్ధికంగా పతనమైన పాకిస్తాన్

Bhavani

Leave a Comment