ప్రజలకు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపు
ఏ తప్పు చేయని అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబును జైలు పాలు చేసి కోర్టులో సాక్ష్యాలు చూపించలేక నానా అవస్థలు పడుతున్నారని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా.చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 23వ రోజు జరిగిన నిరసన దీక్షలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అదోగతిపాలు చేస్తున్నారు. సైకో పాలన అంతమొందించేందుకు ప్రజలందరూ ఏకతాటిపైకి రావాలని చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.
గురువారం నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో వద్ద రిలే దీక్షలకు చదలవాడ తో బాటు గోనుగుంట్ల కోటేశ్వరరావు,మన్నవ మోహన్ కృష్ణ,వేములపల్లి వెంకట నరసయ్య,డా౹౹నెల్లూరి రమేష్,సిపిఐ నాయకులు కాసా రాంబాబు, టీడీపీ,జనసేన నాయకులు సంఘీబావాన్ని తెలిపారు. రిలే నిరాహారదీక్షలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్ట కిరణ్,వాసిరెడ్డి రవి,మన్నన్ షరీఫ్,పులిమి వెంకట రామిరెడ్డి, కడియం కోటి సుబ్బారావు, బండారుపల్లి విశ్వేశ్వరరావు,పులుకూరి జగ్గయ్య,శ్రీరాముర్తి, కూరపాటి శ్రీనివాసరావు, పొనుగోటి శ్రీనివాసరావు, పల్లెల నాగిరెడ్డి,గడిపార్తి సురేష్,గడిపార్తి నరసింహారావు,అబ్బురి శ్రీనివాసరావు,దండ శివరామకృష్ణ,వసంత యలమంద,ఇండ్లమూరి రామారావు,ఆత్తలూరి సాంబశివరావు,పుచ్చాకాయల బసవేశ్వరరావు,పెండ్యాల అప్పారావు,అంకమ్మ చౌదరి,గౌస్ పీరా,బుల్లెట్ బాషా,బోస్,మాబు,కోట హనుమా ప్రసాద్, సంజీవరావు, మల్లవరపు బాబు,చెరుకూరి సురేష్,డౌపాటి శ్రీను,బెల్లం కృష్ణ,నల్లపాటి హరికృష్ణ,నులి రామకృష్ణ,బొప్పన శ్రీకాంత్, దొడ్ల పరమేశ్వరావు,నల్లపాటి చిన్నబ్బాయి,వేముల శివ,గంగ యలమంద,గుత్త సుబ్బారావు,పోక జయమ్మ, వెంకట్నారాయణ,సాంబాశివరావు,నల్లపాటి శివ కుమార్,గాదెల లీల కృష్ణ,గాదెల బాల శ్రీను,దాసరి ఉదయశ్రీ,కనుమూరి లక్ష్మి, భారతి, రంగమ్మ,మొగలిపువ్వు నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.