టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడికి నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నడి రోడ్ల పైనే ఆందోళనలు నిర్వహించింది. అందులో భాగంగా విజయనగరం లో ఆర్.అండ్. బీ అతిథి గృహం వద్ద టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. దాదాపు అరగంట సేపు రోడ్ ను ఈ సాయంత్రం బ్లాక్ చేసింది. సీఎం డౌన్… డౌన్… ఇదేమి రాజ్యం… దోపిడి రాజ్యం…” అంటూ పెద్ద పెట్టున టీడీపీ శ్రేణులు నినదించారు. తొలుత పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా నుంచీ ర్యాలీ గా బయలు దేరి న పార్టీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, బొద్దుల నరసింగరావు, కంది మురళీ నాయుడులు…సమీపంలో ఆర్అండ్బీ జంక్షన్ వరకు పాదయాత్ర చేస్తూ వెళ్లారు.
అక్కడే అరగంట సేపు భైఠాయించి…. అధికార పార్టీ ని అల్లాడించారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత ఐవీపీ రాజు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా పుంగనూరు లో ప్రాజెక్టుల సందర్శనార్ధం… వెళ్లిన చంద్రబాబు కన్వాయిపై…మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు… దాడులకు పాల్పడటం… లో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం శంకుస్థాపన లు చేసిన నీటి పారుదల ప్రాజెక్టులు… జగన్ ప్రభుత్వ హాయాంలో కదలకుండా పోయాయని దాన్ని తెలుసుకునే వెళుతున్న మా పార్టీ అధినేత పై రాళ్ళ దాడి చేయడం… అధికార పార్టీ గూండాయిజంకు నిదర్శనమన్నారు.
అనంతరం పార్టీ నగర కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ… ప్రాజెక్టులు కట్టింది… చంద్రబాబు అని…కానీ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను ఈ నాలుగేళ్ళ జగన్ పాలనలో ఏం చేసిందో తెలుసుకునేందుకు.. మా పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని రాళ్ళ దాడి తో అడ్డుకోవడంతోనే…అధికార పార్టీ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. ఇక టీడీపీ నిరసనకు…వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు, ముగ్గురు ఎస్సై లతో బందోబస్తు నిర్వహించారు… పోలీసులు.