హైదరాబాద్ నల్లకుంట డివిజన్లో వివిధ బస్తీలో ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట డివిజన్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాక చంద్ర, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, ధన్ రాజ్ యాదవ్, కూర నరేందర్, రాము యాదవ్, సతీష్ చంద్ర, అడ్వకేట్ సత్యం, శంకర్ అన్న, ధర్మారావు, పంబరీ శరత్, కాంపల్లి ప్రవీణ్ కుమార్, సతీష్, పాండు యాదవ్, అక్కినపల్లి అశోక్, మహిళా నాయకురాలు రేణుక, అనురాధ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట