33.7 C
Hyderabad
February 13, 2025 21: 07 PM
Slider గుంటూరు

అమరావతి రైతులు కొత్త సంవత్సరం జరుపుకోవద్దు

tdp nrt 22

కొత్త సంవత్సరం జరుపుకోకుండా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. అమరావతి లోనే రాజధాని ఉండాలని ఆందోళనలు చేస్తున్న రైతులను నేడు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలను చేసిన భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు.

ఆర్ధిక నేరస్తులు పరిపాలన చేపడితే ఇదే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, ఇమ్మడిశెట్టి కాశయ్య, మీరావలి,బోస్ తదితరులు ఉన్నారు.

Related posts

మోడీని ఢీ కొట్టేందుకు మమతమ్మ రెడీ

Satyam NEWS

జీడిమెట్ల పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి

Satyam NEWS

ఈ నాలుగేళ్లు జగన్ ప్రభుత్వం పడుకుంది…!

mamatha

Leave a Comment