శివసేన నాయకుడు సంజయ్ రౌత్, సినీనటి కంగనా రనౌత్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. సుశాంత్ సింగ్ రాజపుత్ మరణానికి సంబంధించిన విచారణ జరిపే విషయంలో ముంబయి పోలీసులపై నమ్మకం లేదని ఇటీవల కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది.
ముంబయిలో సినీపరిశ్రమలో మత్తు మందుల వినియోగం విపరీతంగా ఉందని, డ్రగ్స్ స్మగ్లింగ్ ను ముంబయి పోలీసులు ఆపలేకపోతున్నారని కంగనా రనౌత్ బహిరంగ ప్రకటన చేసింది.
దాంతో కోపం కట్టలు తెంచుకున్న శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మండిపడ్డారు. ముంబయి పోలీసులపై నమ్మకం లేకపోతే ముంబయి రావద్దని ఆయన కంగనా పై తీవ్రంగా వ్యాఖ్యానించారు.
దానికి ఆమె సమాధానం చెబుతూ ముంబయి ‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’ ఎప్పటి నుంచి అయిందని తీవ్రంగా సమాధానం ఇచ్చింది.