33.2 C
Hyderabad
May 4, 2024 00: 40 AM
Slider ముఖ్యంశాలు

జగన్ నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి

#lokesh

న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలిసారిగా సుమారు అయిదేళ్ల క్రితం ఎపి ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారు.  ఆయన అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాల్జేస్తున్నాడు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 40రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే కనీస స్పందన లేకపోగా, విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని తన పాలేరు సజ్జలతో బెదిరింపులకు దిగుతున్నాడని లోకేష్ అన్నారు.

ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. జగన్ అంగన్వాడీల పై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తం గా మారబోతోంది. ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్ మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా టిడిపి-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని నేను మాట ఇస్తున్నాను అని లోకేష్ తెలిపారు.

Related posts

భక్తుల ప్రాణరక్షణే ధ్యేయం

Bhavani

ఘనంగా ప్రఖ్యాత బాడీబిల్డర్ కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు

Satyam NEWS

ప్రపంచ దేశాలకు మందులు ఇచ్చే స్థాయికి రావడం గర్వకారణం

Satyam NEWS

Leave a Comment