రూ. 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి వేలాది వాహనాలు లో ప్రజలను విజయవాడకు తరలిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని, జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రేవూరి వేణుగోపాల్ లు ఆరోపించారు.
దళితుడైన కోడి కత్తి శీను ను ఎన్నికల ముందు సానుభూతి కోసం అక్రమంగా కేసులో ఇరికించి గత ఐదేళ్లుగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, శీను ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆదేశాలమేరకు అన్నమయ్య జిల్లా రాజంపేట లో శుక్రవారం నాడు టిడిపి నాయకులు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మందా శ్రీనివాసులు, TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ లు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమల్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేసి నేడు ఎన్నికల ముందు రాజ్యాంగం నిర్మాతను అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
దళిత గిరిజన వాడల్లో ఎక్కడా కూడా కనీసం రోజు సౌకర్యానికి కూడా నోచుకోలేదని, వారి సంక్షేమము, అభివృద్ధి అటు ఉంచితే వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన దాడులు ఎదుర్కొన్నది దళితులు, గిరిజనులేనని అన్నారు. ఎమ్మెల్సీ ఆనంద్ బాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మూడు నెలల్లో బెయిల్ మంజూరయిందని, శీను దళితుడు కావడం చేతనే సంవత్సరాలు తరబడి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు.
శీను బయటకు వస్తే నిజాలు బయటపడతాయన్న భయంతోనే జగన్ రెడ్డి శీను పై వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వైసిపి పాలనలో సుమారు 200 మంది దళితులు హత్య చేయబడ్డారని, ప్రస్తుతం ఎనిమిది మంది వైసీపీ దళిత అభ్యర్థులను స్థానచలనం చేస్తూ దళితులను నాయకత్వం నుంచి కూడా దూరం చేస్తున్నారని తెలిపారు.దళితులకు తీవ్ర అన్యాయం చేసి ఎన్నికల ముందు ప్రలోభాలకు గురి చేసేందుకే అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు చెప్పుకునే యోగ్యత కూడా జగన్ రెడ్డికి లేదని అన్నారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరలా అధికారం చేపడితే రాష్ట్రంలో దళిత జాతే అంతరించిపోతుందని.. దళితులు, గిరిజనులు ఏకమై కోడి కత్తి శీను విడుదలకు కృషిచేసి రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.