పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్ధానం నందు నేడు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భం శ్రీ అమ్మవారికి అభిషేకం జరిగింది.
ఈ కార్యక్రమంలో నిడదవోలు శాసన సభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు దంపతులు పాల్గొన్నారు. తదుపరి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ, లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
అనంతరం చండీహోమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, ధర్మకర్తలమండలి సభ్యులు గాజుల రంగారావు, అయినీడి వెంకట కృష్ణ, యాళ్ల రాఘవులు, ఊర్ల వీర వెంకట లక్ష్మి, కాగిత నాగదేవి, రేలంగి వెంకట లక్ష్మి, ఎస్.వి కె. ఎ.శర్మ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.