29.7 C
Hyderabad
May 6, 2024 05: 24 AM
Slider గుంటూరు

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి

#TDP NRT

అత్యంత గౌరవప్రదమైన వైద్య  వృత్తిలో ఉండి మహిళల పట్ల, బాధిత కుటుంబాల పట్ల బాధ్యతారాహిత్యంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  వ్యవహరించడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడుతూ నిందితులపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ ఆందోళన చేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

స్త్రీల పై లోకేష్ కు అంత మమకారమా ? అంటూ ఎమ్మెల్యే  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం  దిగుజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ‘‘యస్.. మాకు మహిళలంటే మమకారమే.వారిని తోబుట్టువుల్లా చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళల పై మమకారం ఉంది కాబట్టే నాడు ఎన్.టి.ఆర్ ఆస్తిలో హక్కు కల్పించాడు..ఆ తర్వాత చంద్రబాబు మహిళల సాధికారతకు విశేషమైన కృషి చేశారు.ఇప్పుడు లోకేష్ మహిళలకు అండగా,ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు.ముందుండి పోరాటం చేస్తున్నారు.మీ నాయకుల్లా తాడేపల్లి ప్యాలెస్ లో వీడియో గేమ్లు ఆడుకోకుండా నడిరోడ్డు మీదకు వచ్చి అండగా ,అన్నగా నిలబడుతున్నారు’’ అని డాక్టర్ చదలవాడ అన్నారు.

వనజాక్షి గురుంచి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు ?ఆమె స్వయంగా చింతమనేని ప్రభాకర్ ని కలసి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయం నీకు తెలియదా?.రిశితేశ్వరికి అన్యాయం జరిగితే తక్షణమే సంబంధిత వ్యక్తుల పై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుందాం.నేడు ముఖ్యమంత్రి ఇంటి పక్కన  సీతానగరంలో మహిళ పై అత్యాచారం జరిగితే ఇంత వరకు నిందితులను పట్టుకోలేదు.మీదొక  పార్టీ … నువ్వొక..నాయకుడివి …బీ ..కేర్ఫుల్ ..మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు…లోకేష్ గురుంచి అవాకులు చెవాకులు మాటాడితే సహించేది లేదు అంటూ డాక్టర్ చదలవాడ తీవ్రంగా హెచ్చరించారు.

Related posts

రూ.1.35కోట్లతో అభివృద్ది పనులు

Satyam NEWS

ఘనంగా ఉక్కుమనిషి సర్దార్ పటేల్ జయంతి

Satyam NEWS

ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment