భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వం లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం లోని రైతుల సమస్యలపై బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి ఎస్.ఎస్.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో సోమవారం నాడు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వెంకటగిరి, డక్కిలి,బాలాయపల్లి మండలాలకు చెందిన రైతులు, బిజెపి నాయకులు, నెల్లూరు కు చెందిన బిజెపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.ధర్నా అనంతరం నెల్లూరు కలెక్టర్ కార్యాకాయం లో జరుగుతున్న “స్పందన” కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
వెంకటగిరి సామాన్యుడు
previous post