సిపిఐ పార్టీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల సందర్శనకు ఆదివారం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ముందస్తుగా పోలీసులు శనివారం రాత్రి నుంచే అప్రమత్తమై సీపీఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ముప్పాళ నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
శనివారం రాత్రి 11:30కు పోలీసులు తన ఇంటి వద్దకి రావడం తనన గృహ నిర్బంధం చేయడం శోచనీయమన్నారు. మేము వెళ్ళేది నిర్మాణ పోలవరం ప్రాజెక్టు పనుల తీరు తెలుసుకోవడానికి మాత్రమేనని అన్నారు.
సిపిఐ నేతలను అడ్డుకోవడం గృహనిర్బంధం చేయడం ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. మీ అధికారులను పెట్టి మాకు వివరాలు చెప్పండి. మాకు రాష్ట్ర ప్రజలకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడమే కావాలని అన్నారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో చెప్పాలని అన్నారు. తక్షణమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరును తెలుసుకునేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని ప్రభుత్వాన్నిముప్పాళ్ళ డిమాండ్ చేశారు.