తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలోని పిల్లలకు పుస్తకాలను చైల్డ్ వెల్ఫేర్ కమిటి మాజీ చైర్ పర్సన్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కరుకల అనితారెడ్డి పంచిపెట్టారు.
పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఆమె వారికి పలకలను కూడా పంచిపెట్టారు. కోటి రతనాల వీణ నా తెలంగాణ… అనే స్ఫూర్తిలో అందరూ భాగస్వాములు కావాలని ఆ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ దర్పణం పడుతుందని ఆమె తెలిపారు.
వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తెలంగాణ తన వంతు పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.