25.2 C
Hyderabad
May 8, 2024 09: 56 AM
Slider వరంగల్

మల్లికాంబ మనో వికాస కేంద్రం పిల్లలకు పుస్తకాల పంపిణీ

#warangal

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలోని పిల్లలకు పుస్తకాలను చైల్డ్ వెల్ఫేర్ కమిటి మాజీ చైర్ పర్సన్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కరుకల అనితారెడ్డి పంచిపెట్టారు.

పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఆమె వారికి పలకలను కూడా పంచిపెట్టారు. కోటి రతనాల వీణ నా తెలంగాణ… అనే స్ఫూర్తిలో అందరూ భాగస్వాములు కావాలని ఆ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ దర్పణం పడుతుందని ఆమె తెలిపారు.

వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తెలంగాణ తన వంతు పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

Related posts

రేపు మహారాణా ప్రతాప్ సహకార బ్యాంకు ఎన్నికలు

Satyam NEWS

అక్రమ మద్యం రావాణా పై ఉక్కు పాదం

Bhavani

ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై రైతులు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment