37.2 C
Hyderabad
May 1, 2024 12: 36 PM
Slider చిత్తూరు

అక్రమ మద్యం రావాణా పై ఉక్కు పాదం

చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధి తెలుగు గంగ కెనాల్ శివారు ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం బాటిళ్లు మరియు అనుమతి లేకుండా బెల్టు షాపుల ద్వారా అమ్ముతుండగా పట్టుబడిన మద్యం బాటిళ్లను పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మెంట్ బ్యూరో అధికారుల సమక్షంలో గురువారం ధ్వంసం చేయడం జరిగింది.

జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు 13,066 వేలు వివిధ రకాల పరిమాణంలో ఉన్న మద్యం బాటిళ్లను (క్వార్టర్, హాఫ్, ఫుల్) రోడ్ రోలర్ సహాయంతో తిరుపతి జిల్లా అదనపు ఎస్పి పరిపాలన ఈ.సుప్రజ, ic/స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సమక్షంలో లో వాటిని ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పి సుప్రజ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పలు సందర్భాల్లో పట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా అనుమతిలేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తూ అమ్ముతుండగా గత రెండు సంవత్సరాలల్లో సీజ్ చేసిన మద్యం బాటిళ్లు మొత్తం దాదాపు 13,066/ వెలు, (2,405/ లీటర్ల) బాటిళ్లను రోడ్లు రోడ్ రోలర్ సాయంతో ధ్వంసం చేయడం జరిగిందని వీటి విలువ సుమారు 19,000/లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.

అధిక సంపాదనకు ఆశపడి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను సరఫరా చేసి వాటిని అమ్మడం చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే శిక్షార్హులు కాక తప్పదని హెచ్చరించారు.

ఇటీవల కాలంలో అక్రమ ధనార్జన కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు చాలామంది పాల్పడుతున్నారు ముఖ్యంగా యువకులు సైతం కన్ని వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ప్రజలు, యువత గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నారు

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీ.డీ యాక్టు లు కూడా నమోదు చేయవలసి వస్తుందని అన్నారు.

పోలీసు సిబ్బంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సముక్తంగా కలిసి దాడులను మరింతగా ముమ్మరం చేసి పూర్తిస్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం జిల్లా మీదుగా రాష్ట్రం లోకి ప్రవేశించ కుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

తిరుపతి జిల్లా తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వారికి తిరుపతి జిల్లా మీదుగా సరఫరా చేస్తూ రాష్ట్రంలో అక్రమ మధ్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని కావున తమిళనాడు నుంచి తిరుపతి జిల్లాలోకి వచ్చే దారులు అన్నింటిలోనూ ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను ముమ్మరం చేస్తూ దాడులు నిర్వహించి పూర్తిస్థాయిలో ఈ అక్రమ మద్యం రావాణా ను అరికట్టడానికి మరింతగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెబ్ డీఎస్పీ శ్రీనివాసులు, సత్యవేడు సిఐ శివకుమార్ ఎస్ఐలు పురుషోత్తం రెడ్డి, వీరాంజనేయలు, శ్రీనివాసులు రెడ్డీ, మరియు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

పంచాయితీ ఎన్నికలకు మరో మొలిక పెట్టిన ఏపి ప్రభుత్వం

Satyam NEWS

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

60 వేల మంది ఆర్ఎంపీల పొట్ట కొట్టడానికి విలేజ్ క్లినిక్ లు

Bhavani

Leave a Comment