కాకినాడ జిల్లా అనపర్తిలో రైతు భరోసా కేంద్రం దగ్గర జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో రైతు భరోసా కేంద్రం దగ్గర జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు.
తమ నోట్లో మట్టికొడుతున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. తమ దగ్గర తక్కువ రేటుకి ధాన్యం కొనుగోలు చేసినా ప్రభుత్వం మార్కెట్లో బియ్యం ధరలు నియంత్రించటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.