42.2 C
Hyderabad
May 3, 2024 16: 42 PM
Slider వరంగల్

అనారోగ్యంతో మరణించిన పిల్లవాడి కుటుంబానికి తెలంగాణ జాగృతి సాయం

#telangana jagruti

అనారోగ్యంతో మరణించిన పిల్లవాడి కుటుంబాన్ని తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరిక రవీందర్ ఆదుకున్నారు.

ములుగు జిల్లా చల్వాయి గ్రామానికి చెందిన నీరుడు ధన్ రాజ్ దంపతుల 28 రోజుల బాబు ములుగు ఏరియా ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించాడు. సమాచారం అందుకున్న తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరిక రవీందర్ వారి కుటుంబానికి అండగా నిలిచారు.

జాగృతి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 5000 వేల రూపాయలు నగదు, 25 కిలోల బియ్యం సహాయం చేశారు. నిరుపేద కుటుంబానికి తాము ఎల్లప్పుడూ వైద్య పరంగా అందుబాటులో ఉంటామని వారి కుటుంబానికి దైర్యం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జాగృతి యువత అధ్యక్షులు మోడెం శివశంకర్ గౌడ్,మహిళా జిల్లా అధ్యక్షులు గంటమూరి భాగ్యలక్ష్మి, మీడియా ఇంచార్జి నాజర్ ఖాన్,జిల్లా ఉపాధ్యక్షులు కుమార్ పాడ్య,జాగృతి నాయకులు రామకృష్ణ,నటరాజ్,నవీన్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి టౌన్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన యుగంధర్ రెడ్డి

Satyam NEWS

ఫ్రాన్స్ ప్రముఖులకు ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే

Satyam NEWS

అత్యాచార బాధిత మహిళలు బాలికలకు భరోసా కల్పిస్తాం

Satyam NEWS

Leave a Comment