31.2 C
Hyderabad
May 3, 2024 02: 52 AM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ కేంద్రంగా రూ 700 కోట్లతో స్కై వర్త్ కంపెనీ

ktr skyworth

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది.  ఎలక్ట్రానిక్స్ కంపెనీ  స్కైవర్త్ తన ఉత్పత్తుల తయారీకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ  మంత్రి కేటీఆర్ తో  స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ మిస్టర్ లై వీడ్ భేటీ అయ్యారు.

రాష్ట్రంలో తమ ఉత్పత్తులకు సంబంధించి స్కైవర్త్ లీడర్షిప్ ఉన్నత ప్రతినిధి బృందం, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్ లో  జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ మిస్టర్ లై వీడ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. స్కై వర్త్ కంపెనీ తెలంగాణాలో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దశల వారీగా పెట్టుబడులను పెట్టనుంది.

ఇందులో భాగంగా మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా రూ 700 కోట్లతో 50 ఎకరాలలో  అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును  ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగ పెట్టుబడి ఇది. దీంతోపాటు దేశంలోకి వచ్చిన అతిపెద్ద చైనీస్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల్లో ఇది ఒకటి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ & మెట్జ్ బ్రాండ్ ఎల్ఈడి టీవీలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్నాయి.

దాని రెండవ దశ విస్తరణలో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే తాజా తరం లిథియం బ్యాటరీల తయారీ, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల తయారీని చేరుస్తారు. ఈ సందర్భంగా బోర్డు ఛైర్మన్ మిస్టర్ లై వీడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు అనుగుణంగా ఉన్నాయని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను లభిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం అన్నారు.

స్కై వర్త్ ద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు తీసుకురానుందని. స్థానిక ప్రజల నైపుణ్యాలను పెంచడనికి స్కైవర్త్  పనిచేస్తున్నదని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ వాంగ్ జెంజున్ మాట్లాడుతూ.. స్కైవర్త్ గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ లో భాగంగా భారతదేశం చాలా వ్యూహాత్మక మార్కెట్ అని స్కైవర్త్ & మెట్జ్ యొక్క నాణ్యత, తాజా టెక్నాలజీ AIOT ఉత్పత్తులు భారతీయ వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందడం జరిగిందని తెలిపారు.

స్కైవర్త్  హైదరాబాద్‌ను తన ఉత్పాదక గమ్యస్థానంగా ఎంచుకున్నదని, ఇది ఐదువేల మందికి పైగా ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుందని తెలంగాణ ప్రభుత్వ ఐటి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి, టియస్ ఐఐసి ఎండీ నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

అప్పుడు అరిచిగోల చేసిన మోదీ… ఇప్పుడు మౌనమేల?

Satyam NEWS

విద్యాసంస్థల్లో బియ్యం సరిగా ఉంచకపోతే అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS

త్వరలో రాష్ట్రం అంతా అంధకారంలోకి వెళ్తుంది… గ్యారెంటీ

Satyam NEWS

Leave a Comment