29.7 C
Hyderabad
May 6, 2024 05: 25 AM
Slider చిత్తూరు

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లికూతురు

#Sucide Case

నవ వధువు ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తిరుపతిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న సునీత (30) తెలంగాణకు చెందిన మహిళ గా పోలీసులు గుర్తించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగేశ్వర నగర్ లో ఈ ఘటన జరిగింది.

సునీత భర్త గురునాథ్ తో కలిసి లింగేశ్వర నగర్ లో నివాసం ఉంటున్నది. పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లో విధులు నిర్వహిస్తున్న గురునాథ్ 6 నెలల క్రితం సునీతతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నది. సునీత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తిరుచానూరు సిఐ సుధాకర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఎర్రబల్లె చెరువు పరిశీల‌న

Sub Editor

టేస్ట్ ఆఫ్ హైదరాబాద్: మదీనాగూడ లో ఆహా ఏమి రుచి!

Satyam NEWS

రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే కష్టపడాలి

Satyam NEWS

Leave a Comment