నవ వధువు ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తిరుపతిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న సునీత (30) తెలంగాణకు చెందిన మహిళ గా పోలీసులు గుర్తించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగేశ్వర నగర్ లో ఈ ఘటన జరిగింది.
సునీత భర్త గురునాథ్ తో కలిసి లింగేశ్వర నగర్ లో నివాసం ఉంటున్నది. పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లో విధులు నిర్వహిస్తున్న గురునాథ్ 6 నెలల క్రితం సునీతతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నది. సునీత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తిరుచానూరు సిఐ సుధాకర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.