38.2 C
Hyderabad
April 29, 2024 14: 57 PM
Slider వరంగల్

యాదాద్రి శ్రీ‌ ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి ని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి

#Minister Errabelly Dayakarrao

త‌న పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని, యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర్సింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం సాయంత్రం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య పూజారులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగ‌తం ప‌లికారు. మంత్రి ప్ర‌ధాన గ‌ర్భ‌గుడిలో దేవుడిని ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం ఆల‌య అర్చ‌కులు మంత్రి ఎర్ర‌బెల్లికి ప‌ట్టు వ‌స్త్రాలు అందించి ఆశీర్వ‌దించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, త‌మ ఇల వేల్పు అయిన యాదాద్రి శ్రీ ల‌క్ష్మీనర్సింహ స్వామి వారిని త‌ర‌చూ ద‌ర్శించుకుంటామ‌ని చెప్పారు. ఈ రోజు త‌న పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌త్యేకంగా యాదాద్రికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ‌ రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Related posts

గంజాయి మత్తులో పెట్రోలు బంకుపై దాడి చేసిన యువకులు

Satyam NEWS

ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకుడిని కాదు

Satyam NEWS

“ఉజ్జ్వ‌ల భార‌త్ – ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్” పేరుతో విద్యుత్ ఉత్స‌వాలు

Satyam NEWS

Leave a Comment