రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు మహా పాదయాత్ర నిర్వహించారు.
నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు నేడు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
అమరావతి నే ఏకైక రాజధాని గా కొనసాగించాలని అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పాదయాత్ర లో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో బాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టిడిపి నేతలు కొమ్మరెడ్డి చలమరెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాజా మాస్టార్, సింహాద్రి యాదవ్,మల్లి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.