విశాఖ లో ఈ నెల 15 వ తేదీ న ఆదివారం విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో తెలుగుయువత సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు అశోక్ బంగ్లాలో తెలుగు యువత మీడియా సమావేశంలో ఈ విషయం తెలియచేశారు. ఈ సందర్భంగా తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేమలి చైతన్య బాబు, గొలగాన సురేంద్ర , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోగిరి పైడిరాజు, నియోజకవర్గాల అధ్యక్షులు గంటా రవి, పిన్నింటి కిషోర్ కుమార్, పెడిరెడ్ల సత్యన్నారాయణ, పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి పాలూరి రాజు నాయుడు, పార్లమెంట్ అధికార ప్రతినిధి చిప్పాడ స్వామి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు పడాల జోగేష్, పట్టణ నాయకులు మాతా బుజ్జి, పీతల కోదండరాంలు మాట్లాడారు.
ఈ నెల 15వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుయువత జోన్ 1 (శ్రీకాకుళం, అరకు , విజయనగరం , అనకాపల్లి, విశాఖ) తెలుగుయువత నాయకులకు వర్క్ షాప్ ఏర్పాటు చేయడమైనదని, ఈ వర్క్ షాప్ లో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
ఈ నెల 15 వ తేదీ న ఆదివారం ఉదయం 7గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లా కు చేరుకొని , ఇక్కడ నుండి బయలుదేరి విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్ కమిటీ సభ్యులు, అసెంబ్లీ కమిటీ సభ్యులు, మండల/,పట్టణ కమిటీ సభ్యులు, గ్రామ,వార్డు తెలుగుయువత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తప్పనిసరిగా హాజరై తెలుగు యువత సదస్సును విజయవంతం చేయాలని కోరుచున్నామని తెలుగు యువత కోరింది.