26.7 C
Hyderabad
April 27, 2024 07: 55 AM
Slider పశ్చిమగోదావరి

తాగి వచ్చాడు… భార్యను కొట్టి చంపాడు

#Trinath

తాగిన మత్తులో భార్యనే హత్య చేశాడో భర్త. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం లో ఈ దారుణం జరిగింది.

అవిడి త్రినాథ్ అనే వ్యక్తి కొద్ది కాలం కిందట కుమారి (22) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం కలిగారు.

అయితే త్రినాథ్ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతడిని భార్య నిలదీసింది.

దాంతో పొయ్యి లో ఉన్న కర్ర తో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో సంఘటనా స్థలంలోనే కుమారి చనిపోయింది.

వీరికి కుమార్తె సీతారామలక్ష్మి (5), పెద్ద కుమారుడు అమ్మిరాజు(4), చిన్న కుమారుడు శరత్ చంద్ర(2) ఉన్నారు.

నిడదవోలు సిఐ K.A. స్వామి ఆధ్వర్యంలో నిందితుడు ఏ.త్రినాథ్ ను అదుపులోకి తీసుకుని చాగల్లు ఎస్.ఐ జి .జే .విష్ణువర్ధన్ దర్యాప్తు చేపట్టారు.

Related posts

యుద్ధం…

Satyam NEWS

ఎరుపు రంగు గా మారిన విజయనగరం కలెక్టరేట్ జంక్షన్…!

Satyam NEWS

పిల్ల‌నిచ్చిన అత్తింటికే క‌న్నం వేసిన అల్లుళ్లు…!

Satyam NEWS

Leave a Comment