ఖమ్మం నగరంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులు రూ .1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరంలోని 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.1 లో రూ.90 లక్షలు, 9వ డివిజన్ ఇందిరా నగర్ నందు కల్వర్టు లతో కూడిన 2.5కిలో మీటర్ల మేర సీసీ డ్రైన్ కు రూ.90లక్షలు మొత్తం రూ.1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు కూడా పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరం శరవేగంగా విస్తరించింది..
అందుకు కారణం BRS ప్రభుత్వమేనని, గడచిన 20 ఏళ్లలో ఏ నాడూ ఇంత అభివృద్ది జరగలేదని, ఒకప్పుడు చిన్న చిన్న గల్లిలు, చిన్న చిన్న దారులుగా ఉండేవన్నారు. కానీ నేడు ఇదే నగరం అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టడం జరిగింది.. కనీస వసతులు లేని స్థితి నుండి నేడు సకల వసతులతో సకల సౌకర్యాలతో ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు కల్పించాం అన్నారు.