కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 100కోట్లు విడుదల చేసినందుకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ తో కొండగట్టు రూపురేఖలు మారిపోతాయి. దేవాలయాల అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మరువలేనిదని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాలను చిన్నచూపు చూశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో యాదాద్రి, వేములవాడ దేవస్థానాలు అభివృద్ధి చెందాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో కొండగట్టు దశ దిశ మారనుందని ఆయన అన్నారు.