29.7 C
Hyderabad
May 2, 2024 04: 38 AM
Slider కడప

చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడి అ ప్రజాస్వామికం

చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేయడం అ ప్రజాస్వామికమని టిడిపి రాజంపేట పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర తెలిపారు.శనివారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నంది గ్రామంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడం దారుణ మన్నారు.ఇది వైసిపి పిరికి పందచర్య అన్నారు.

దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రత అధికారి మధు బాబుకు గాయాలయ్యాయని, పోలీసు భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈదాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ అధినేత అయిన ఎక్కడైనా పర్యటించుకోవచ్చని ఆ విషయాన్ని పాలకపక్షానికి తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు.రానున్నది టిడిపి ప్రభుత్వమే అని అదే పని చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాల్సింది పోయి దాడులు చేయడం తగదన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తమ నాయకుడు పర్యటిస్తే వైసిపి వారికి ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదన్నారు

Related posts

తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐపిఎస్ ల బదిలీ

Satyam NEWS

ఆకాష్ విద్యాసంస్థల చైర్మన్ మనసు ఆకాశమంత

Satyam NEWS

జీవీడీ ఆంక్షలు: జగన్ వద్ద వాపోయిన మంత్రులు….?

Satyam NEWS

Leave a Comment