ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగిపోయిన అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ అంశంపై అత్యవసర విచారణ అవసరమని, ఈ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పిటిషనర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ కోసం మంగళవారం (జనవరి 10) ఈ అంశాన్ని జాబితా చేయాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
జోషిమఠ్ భూమి కుంగిపోతున్న కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తరపున పిటిషన్ దాఖలైంది. సోమవారం, పిటిషనర్ తరపు న్యాయవాది ఈ అంశంపై అత్యవసర విచారణను కోరగా, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తి పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను స్వీకరించింది.
మంగళవారం పిటిషన్ను విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ వల్ల జోషిమఠ్లో కొండచరియలు విరిగిపడ్డాయని, ఉత్తరాఖండ్ ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం మరియు నష్టపరిహారం అందించాలని పిటిషన్లో పేర్కొన్నారు.