38.2 C
Hyderabad
April 27, 2024 15: 28 PM
Slider కడప

రాజంపేట లో వైసీపీ కి ఎదురు దెబ్బ….

ఎమ్మెల్యే మేడా మాల్లిఖార్జున రెడ్డి చిన్నాన్న కుమారుడు మేడా బాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో బేటీ అయ్యారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వైసీపీ సుండుపల్లె ఇంచార్జీ మేడా విజయ శేఖర్ రెడ్డి బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ లో బేటీ అయ్యారు.డేరింగ్ లీడర్ గా,యువనేత గా,కాంట్రాక్టర్ గా పేరు పొందిన మేడా విజయ శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మేడా మాల్లిఖార్జున రెడ్డి కి స్వయంగా చిన్నాన్న కుమారుడు కావడం విశేషం.

సుండుపల్లె వైసీపీ ఇంచార్జీ గా ఎమ్మెల్యే మేడా మాల్లిఖార్జున రెడ్డి టీడీపీలో, అనంతరం వైసీపీ లో ఎమ్మెల్యే గా గెలుపులో కీలక పాత్ర పోషించారు. అటువంటి మేడా విజయ శేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను కలవడం చర్చనీయాంశంగా మారింది.కలకలం రేపుతోంది.మేడా విజయ శేఖర్ రెడ్డి
హైదరాబాద్ నుంచి ఫోన్ లో సత్యం న్యూస్ తో మాట్లాడుతూ తాను చంద్రబాబు నాయుడు తో బేటీ అయ్యింది నిజమే అని నిర్ధారించారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను రాజంపేట నుంచి పోటీ చేస్తానని,రాజకీయాల్లో బంధుత్వం కు తావు లేదని,రాజంపేట అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని సృష్టం చేశారు.

Related posts

జామి సురేశ్ కిడ్నాప్ రహస్యం ఛేదించిన పోలీసులు

Satyam NEWS

టెండర్ హెడేక్: అభ్యర్థులకు తలనొప్పిగా మారిన రీపోలింగ్

Satyam NEWS

నేడు ఆఖరి పనిదినాన్ని ముగించుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

Satyam NEWS

Leave a Comment