గంజాయి రవాణా చేస్తూ జిల్లా బోర్డర్ ని దాటి రెండు వాహనాలను ఢీ కొట్టి, పారిపోతున్న దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు క్వింటాకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులలో ఇరువురిని మునగాల సిఐ ఆంజనేయులు, మునగాల ఎస్సై పి లోకేష్ , పోలీసు సిబ్బంది సుదర్శన్, ఈశ్వరుల ఆధ్వర్యంలో మునగాల శివారులో పట్టుకోగా కారు దిగి పారిపోతున్న మరో వ్యక్తిని చివ్వెంల మండలం గుంజలూరు శివారులో మునగాల సీఐ, మునగాల ఎస్సై, పెన్ పహాడ్ ఎస్సై పోలీసు సిబ్బంది స్థానిక యువకులు వెంటాడి గుంజలూరి శివారులో పట్టుబడే లా చేశారు. సూర్యాపేట హైవే పెట్రోలింగ్ పోలీసులు గుంజలూరు సమీపంలో నిందితులు వెళుతున్న కారుని వెంటాడి అడ్డుకున్నారు. దీంతో నిందితులు దిగి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కారు. గంటన్నర సేపు ఉరుకుల పరుగుల మధ్య అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
previous post