మునుగోడు ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీకి డ్రా లో వచ్చిన రోడ్ రోలర్ గుర్తును తొలగించి బేబీ వాకర్ గుర్తు కేటాయించారు. తమకు కేటాయించిన గుర్తు తొలగించడంపై యుగతులసి పార్టీ అధ్యక్షులు కె. శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం మొత్తం మునుగోడు ఎన్నిక పై ఎదురుచూస్తుందని, ఎన్నికల సంఘం తో టీఆర్ఎస్ కుమ్ముకు అయ్యిందని ఆరోపించారు. సింబల్ ఎలాట్మెంట్ పబ్లిక్ గా చెప్పారని, రోడ్ రోలర్ గుర్తు యుగతులసి కి కేటాయించ బడిందని, తన సంతకం కూడా తీసుకున్నారని, ఇప్పుడు బేబీ వాకర్ గుర్తు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చి సింబల్ మార్చుకోవాలని నన్ను అడిగాడని, తను ఒప్పుకోలేదన్నారు. కేంద్ర ఎన్నికలు సంఘంని కలిశమని, హైకోర్ట్ లో కేసు వేసామని ,రోడ్ రోలర్ గుర్తును తిరిగి కేటాయించాలని డిమాండ్ చేసామనరు. హై కోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టు కు వెళ్తాం అని, తమ గుర్తు తమకు రాకపోతే ఎన్నికలు రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం అని తెలిపారు.
next post