నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో 24 గంటలు గడవక ముందే మళ్లీ భారీ చోరీ కలకలం రేపింది. 15 తులాల బంగారం మూడు లక్షల 40000 రూపాయలు నగదు దోచుకెళ్లినట్టు ఇంటి యజమాని ఆత్మకురి శ్రీనివాసులు తెలిపారు.
ఒకేరోజులో రెండు చోట్ల భారీ చోరీ జరిగాయి. విద్యానగర్ కాలనీలోని విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో 55 తులాల బంగారం మూడు లక్షల నగదు, వాసవి నగర్ లోని ఆత్మకూరు శ్రీనివాసులు ఇంట్లో 15 తులాల బంగారం మూడు లక్షల 40000 రూపాయలు నగదు దొంగలు దోచుకెళ్లారు.
రెండు కేసుల్లో పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తన కుమారుడు కాలేజీకి మూడు రోజులు సెలవులు ఉండటంతో అప్పటివరకు ఇంట్లోనే
సాయంత్రం 6.30 వరకుఉన్నారనీ అప్పుడే వారి దుకాణం వద్దకు వెళ్లి 7 గంటల 40 నిమిషాలకు తన తల్లితో ఇంటికి వచ్చి తాళం తీయగా వస్తువులన్నీ బీరువాలోని బట్టలు చిందరవందరంగా ఉండడంతో కంగుతిని తనకు ఫోన్ చేసి పిలిపించినట్లు వెనుక ద్వారం గుండా తలుపు గట్టిగా తోసి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు తెలిపారు.
డిఎస్పి గిరిబాబు, సిఐ సైదులుసంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అనంతరం జిల్లా నుండి వచ్చిన క్లూస్ టీమ్స్ దొంగల వేలిముద్రలు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.