అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం టి. జగ్గపేట శివారు శ్రీరాంపురంలో పెద్దపులి తిరుగుతున్నట్లు సమాచారం అందింది. ఈ పెద్దపులి శ్రీరాంపురం చిన్న అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపి నట్లు గ్రామస్తులు తెలిపారు.
స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. నక్కపల్లి మండలం,కోటవురట్ల మండలం అటవీ ప్రాంతాలలో ఉన్న స్థానికులు భయాందోళన చెందుతున్నారు.