28.7 C
Hyderabad
April 28, 2024 03: 14 AM
Slider జాతీయం

బ్రుటల్:పెళ్ళైపిల్లలు ఉన్నాయువతిఫై పెట్రోల్ పోసి నిప్పు

maharastra-wardha-techer-set-ablise-refused-lover

మహారాష్ట్రలో దారుణంజరిగింది. తనను ప్రేమించడం లేదనే కోపం తో యువతి ఫై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వార్ధా జిల్లా నందోరి చౌక్‌లో వికేశ్‌ అనే యువకుడు పట్టపగలే నడిరోడ్డుపైనే జనాలందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. వివారాల్లోకి వెళితే మహారాష్ట్ర లోని దడోరా గ్రామానికి చెందిన ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నఅంకిత (26)ను అక్కడే ఉండే వికేశ్‌(27)వెంటపడి వేధించేవాడు.మొదట పెళ్లి కాలేదని ప్రేమ పేరుతొ దగ్గరయిన అతడికి పెళ్లయి భార్య కొడుకు ఉన్నారని తెలిసి అతడి ప్రవర్తన నచ్చక రెండేళ్ల నుంచి అతడిని దూరం పెట్టింది.

సోమవారం ఉదయం కళాశాల వద్ద కాపుకాసిన వికేశ్‌ అంకితతో తనతో రావాలని ఘర్షణకు దిగాడు.నిరాకరించడం తో తన వెంట తెచ్చిన పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు గమనించేలోగా ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. మంటల్లో చిక్కుకున్న అంకితను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నాగ్‌పుర్‌కు తరలించారు.పెళ్లయిన అతడు అంకితను కోరుకుంటూ ఒక సారి ఆత్మ హత్యకు యత్న్చాడని,ఆమె వివాహ ప్రయత్నాలకు అడ్డు పడుతున్నాడని జిల్లా ఎస్పీ తెలిపారు.

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీనిపై సత్వరం విచారణ చేపడతామని ప్రకటించింది.నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వెంటనే చేపట్టండి

Bhavani

స్పెషల్ ఆధార్ క్యాంపులలో ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలి

Bhavani

రిక్వెస్ట్: తీసుకున్నరుణాలన్నీవందశాతం తిరిగి చెల్లిస్తా

Satyam NEWS

Leave a Comment