30.2 C
Hyderabad
April 27, 2025 19: 51 PM
Slider జాతీయం

ముత్తూట్ ఫైనాన్స్ లో 77 కిలోల బంగారం చోరీ

th

కర్ణాటకలోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అత్యంత భారీ దొంగతనం జరిగింది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి – హెణ్ణూరు రోడ్‌ లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 77 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు.

గోడకు కన్నమేసి లోపలికి వెళ్లిన దొంగలు, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను తొలగించి, ఆపై నగలు దాచివుంచే బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి, దోపిడీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, దొంగతనం జరిగిన తీరును గమనించి, లోపలి పరిస్థితుల గురించి తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో విచారణ ప్రారంభించారు.

Related posts

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

Satyam NEWS

హైదరాబాద్ నుంచి కొలంబోకు డైరెక్ట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం

Satyam NEWS

Calamity: ఈ వాగు దాటితే అదే బంగారు తెలంగాణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!