మంత్రి శ్రీనివాస్ గౌడ్ను చంపాల్సిన అవసరం ఎవరకీ లేదని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కు కుట్ర పన్నారని చెప్పడం ఒక బోగస్ వ్యవహారమని ఆమె అన్నారు. ఈ అంశంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాపత్రయ పడుతున్నారని అరుణ అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాడుతున్న వారికి కచ్చితంగా షల్టర్ ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉందని ఆరోపించారు. ”రాత్రి వేళ ఇంటిపై రాళ్ళు వేయటం కాదు.. దమ్ముంటే నాపై రాజకీయంగా పోరాడాలి. ఇది బెంగాల్ కాదు.. పీకే వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. తనకూ భార్య, పిల్లలున్నారని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. మహిళగా కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతానని అరుణ అన్నారు. పులిలా ఉండే పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర.. పిల్లిలా మారటం బాధాకరం అని డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు.