కడప జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. సగిలేరు డ్యామ్ లో ఇద్దరు పసిపిల్లల మృతదేహాలతో బాటు వారి తల్లి మృతదేహం కూడా లభ్యం అయింది.
గుర్తు తెలియని ఒక తల్లి ఇద్దరు పిల్లలు మృత దేహాలు లభ్యం కావడం ఇక్కడ సంచలనం కలిగించింది. బి.కోడూరు ప్రాంతంలో నీటిలో తేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయి.
స్థానికులు ఈ మేరకు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.