కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరి వారి పల్లి సమీపంలో ఉన్న గని లో మంగళవారం ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు.
ఏడు మంది యువకులు ఈతకు వెళ్లగా ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన ముగ్గురు యువకులు ఎర్రగుంట్ల రాణి వనం వాసులుగా గుర్తించారు. వారిలో కమల్ భాష (19),కృష్ణ చైతన్య (18) ,సయ్యద్ (10) ఉన్నారు.
సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది,పోలీసులు, బంధువులు గాలింపు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు.