కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది.
19 రోజుల పాటు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ. 1,96,05,093/-లు వచ్చినట్టు ఈఓ కె.ఎస్.రామారావు తెలిపారు.
అలాగే నగదు తో పాటు 282 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారు, 9 కేజీల 275 గ్రాముల వెండి లభించిందన్నారు.