శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం,డి ముత్యలేశం పంచాయితీ రాళ్లపేట లో హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం 120 కుటుంబాలకు బియ్యం, గుడ్లు, చింతపండు ఇతర కాయకూరలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమం లో శ్రీకాకుళం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గురుగుబెల్లి నరసింహ మూర్తి, ఎక్స్ యం.పి.టి.సి మూగి శ్రీరాములు, సంస్థ సెక్రటరీ సునీల్ తో పాటు మందాత అప్పారావు, మూగి గురుమూర్తి, సూర్యనారాయణ, శ్రీధర్, రజనీకాంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ లో భాగంగా నిత్యావసరాలు సరఫరా చేస్తూనే ప్రతి ఇంటికి వెళ్లి కరోనా వైరస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు. బయట నుండి ఎవరన్నా ఊరు వస్తే తప్పకుండా క్వారెంటయిన్ కి పంపించాలని హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజలకు వివరించారు. ఇలా చేయడం వల్లే అందరూ తమ కుటుంబాన్ని, తద్వారా గ్రామాన్ని కాపాడుకోవచ్చు అని వివరించారు.