29.7 C
Hyderabad
May 3, 2024 06: 46 AM
Slider విజయనగరం

విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీల జిఓ కాపీలు దగ్ధం చేసిన సీపీఎం

#cpmvijayanagaram

విద్యుత్ ట్రూ ఆఫ్ టారిఫ్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ  విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని  29 వ డివిజన్ లో సీపీఎం ఆధ్వర్యంలో జి. ఓ కాపీలని దగ్ధం చేశారు.

ఈసందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ టారీఫ్ పేరుతో రెట్లు పెంచి ప్రజల పై బారాలు మోపిందన్నీరు.  2014,-2015, 2018-2019 వరకు వినియోగించిన విద్యుత్ కు ట్రూ అప్ చార్జీలు పేరుతో 3600 కోట్లు ప్రజలపై భారాలు వేసి న కేంద్రం తక్షణం రద్దు చేయాలని   డిమాండ్ చేశారు.

కరోనా కష్టకాలం లో   కేంద్ర ప్రభుత్వం  ప్రజలకు ఆర్థిక సహాయం చేయక పోగా ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెంచేసిందని ఆరోపించారు. మరో వైపు గ్యాస్.. పెట్రోల్.. డీజిల్ ధరలను పెంచుతూ ఉంటే ప్రజలు భారాలు మోయలేక కష్టాలు పడుతున్నారని అన్నారు.

అలాగే అరు లక్షల కోట్ల ఆస్తులు తనఖా పెట్టేందుకు సిద్ధమవుతున్న‌ద‌నీ…. ఇది దేశద్రోహం అని విమ‌ర్శించారు. భవిష్యత్ లో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వ హిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యు లు శాంతమూర్తి. శాఖా కార్య దర్శి త్రినాథ్ తది తరులు పాల్గొన్నారు.

Related posts

బాబామెట్ట ఖాదర్.వలీ ఆశ్రమంలో రేంజ్ డీఐజీ..!

Satyam NEWS

పోలీస్ విజిల్: ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్ర భగ్నం

Satyam NEWS

కన్సూమర్ ఎఫైర్ విజిలెన్స్ కమిటీకి అనితారెడ్డి

Satyam NEWS

Leave a Comment