నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధి పురం గ్రామం లో మండల వైకాపా నేత సూరా శ్రీనివాసుల రెడ్డి మంగళవారం ఆత్మహత్యా యత్నం చేశారు. తన స్వంత పొలంలో ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు పోలీసులకు తెలపడం తో వారు ఆయన్ను అడ్డుకున్నారు.
ఆత్మహత్య చేసుకొనేందుకు తెచ్చుకున్న పురుగుల మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో శ్రీనివాసులురెడ్డి కి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం 108 వాహనం లో నెల్లూరుకు తరలించారు. తన అయిదు ఎకరాల పొలంలో ఎకరా పొలాన్ని 15 లక్షల కు ప్రభుత్వానికి అమ్మారు. అయితే తన పొలంలో 29 సెంట్లు శివాయి భూమి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారని తెలిపారు. దాంతో తాను ప్రభుత్వానికి అమ్మిన ఎకరా పొలంలో దీనిని మినహాయించుకోవాలని కోరారు.
అయితే అలా కుదరదని ఎకరా పొలంతో పాటు 29 సెంట్ల పొలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ మేరకు తాను వరి నాట్లు వేసుకున్న స్థలం లో రెవిన్యూ సిబ్బంది మంగళవారం గుర్తులు పెట్టి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దాంతో మనస్తాపం చెంది రైతు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు.