ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాల నిర్మాణం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడాల్ మండలం రావిచెడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మూత్రశాల నిర్మాణం చేపట్టారు. గతంలో జెడ్పిటిసిపల వెంకటేష్ విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమంలో గ్రామ యువకులు గ్రామ సర్పంచ్ పాఠశాల స్థితిగతులను, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గురించి వారికి వివరించారు. వెంటనే ఆయన స్పందించి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మూత్రశాలల నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితర నాయకులు పాల్గొన్నారు.
previous post